Tue. Jul 9th, 2024

ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వెరిన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌తో జూలై 2024లో వివాహం జరగనుంది. ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి.

పాప్ గాయని రిహన్న ప్రీ-వెడ్డింగ్ వేడుకలలో ప్రదర్శన ఇస్తున్నారు, మరియు నివేదికల ప్రకారం, బార్బడియన్ గాయని ఆమె పారితోషికం 52 కోట్లు అందుకుంటుంది అట. రిహన్న పారితోషికం గురించి వార్తలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. రిహన్న తన భాగస్వామి ఎఎస్ఎపి రాకీతో కలిసి ఈ సాయంత్రం జామ్‌నగర్‌కు చేరుకున్నారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ తమ ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమాలలో భాగంగా సుమారు 51000 మంది స్థానిక నివాసితులకు ఆహారాన్ని అందించారు. ఈ వేడుకకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్, అజయ్ దేవగన్, అలియా భట్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *