ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి శనివారం రాత్రి హైదరాబాద్లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరై మెగాస్టార్కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. చిరంజీవికి ఈ అవార్డు రావడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నటుడు రామ్ చరణ్తో కొద్దిసేపు సంభాషించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ మంత్రి డీకే అరుణ, సినీ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు మరియు రాజకీయ రంగాల వారు పాల్గొన్నారు.