రాష్ట్ర వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై క్రిమినల్ కేసు నమోదైంది. దీనిపై ఏపీ ప్రభుత్వం గుంటూరు కోర్టులో కేసు వేసింది.
గత ఏడాది జూలై 9వ తేదీన వాలంటీర్లపై పవన్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తూ ఐపీసీ 499, 500 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది.
ఇదిలా ఉండగా, మేజిస్ట్రేట్ కేసును నాలుగో అదనపు జిల్లా కోర్టుకు మళ్లించారు. ఫిబ్రవరి 25న జరిగే విచారణకు పవన్ను పిలిపిస్తూ నోటీసులు జారీ చేసింది.